Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నితిన్ సినిమా ఆగిపోయిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవమెంత!
ఛలో చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుములు తొలి ప్రయత్నంతోనే మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషనల్స్, కామెడీ ఇలా అన్ని అంశాలని వెంకీ కుడుములు ఛలో చిత్రంలో సమపాళ్లలో చూపించాడు. ఈ దర్శకుడికి మంచి డిమాండ్ ఏర్పడింది. వెంకీ కుడుములతో నితిన్ నెక్స్ట్ మూవీ ఉంటుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి.
ఈ చిత్రం ఆగిపోయిందని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. వెంకీ కుడుములు ఇప్పటికే నితిన్ కోసం కథ సిద్ధం చేశాడని, ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడని నితిన్ సన్నిహితులు చెబుతున్నారు.
అతిత్వరలో ఈ చిత్రం గురించి నితిన్ స్వయంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు 9 న ఈ చిత్రన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.