Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నితిన్ సినిమా ఆగిపోయిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవమెంత!
ఛలో చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుములు తొలి ప్రయత్నంతోనే మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషనల్స్, కామెడీ ఇలా అన్ని అంశాలని వెంకీ కుడుములు ఛలో చిత్రంలో సమపాళ్లలో చూపించాడు. ఈ దర్శకుడికి మంచి డిమాండ్ ఏర్పడింది. వెంకీ కుడుములతో నితిన్ నెక్స్ట్ మూవీ ఉంటుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి.
ఈ చిత్రం ఆగిపోయిందని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. వెంకీ కుడుములు ఇప్పటికే నితిన్ కోసం కథ సిద్ధం చేశాడని, ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడని నితిన్ సన్నిహితులు చెబుతున్నారు.
అతిత్వరలో ఈ చిత్రం గురించి నితిన్ స్వయంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు 9 న ఈ చిత్రన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.