వెంకీ-త్రిష చిత్రం ఖరారు

By Staff

Venkatesh-Trisha
వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించనున్న చిత్రం దాదాపు ఖరారయినట్లే నని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ముహూర్తం చేసి, ఏప్రియల్ నుండి రెగ్యులర్ షూటింగ్ కి ప్లన్ చేస్తున్నారు. ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా తీసిన గిరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు.

ఈ చిత్రంలో శ్రీను వైట్ల చిత్రాలలోగానే బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనపించనున్నట్లు సమాచారం. పూర్తి క్లీన్ ప్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకటేష్ దీన్ని రూపొందించాలని శ్రీను వైట్లకు చెప్పారని తెలుస్తోంది. ఇక క్రిష్,వెంకటేష్ ల కాంబినేషన్ సినిమా ఇంకా రెడీ కాలేదు. క్రిష్ ఇంకా కథపైనే కుస్తీ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నలుగురు కుర్రాళ్ళు..వాళ్ళను ఉత్తేజపరిచే ఎన్నారైగా క్రిష్ ఈ కథను తీర్చిదిద్దారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ కి పూర్తి స్ధాయి సంతృప్తి ఇవ్వలేదని, ఇంకా ఎంటర్టైన్ మెంట్ కావాలని,కలపమని చెప్పటంతో అదే పని మీదే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ లోగా వెంకీ..శ్రీను సినిమాను పూర్తి చేసేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X