Don't Miss!
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కమిలినీ ముఖర్జీ ఆ హీరో కలిస్తే హిట్టవుతుందా?
కమిలినీ ముఖర్జీ, వేణు కాంబినేషన్ లో వంశీ రూపొందించిన 'గోపి-గోపిక-గోదావరి" చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే జంట వేణు-కమలినీ ముఖర్జీలతో ఈశ్వర్ దర్శకత్వంలో ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.6గా ఓ చిత్రం రూపొందుతోంది. సిఐడి మూస అనే మళయాళ చిత్రం రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నిర్మాత వెంకట శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ..'క్లైమాక్స్ సీన్స్, మూడు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈనెల 15 నుంచి జరిగే చివరి షెడ్యూల్ లో క్లయిమాక్స్ ను చిత్రీకరించనున్నాం. తర్వాత ఫారిన్ లో హీరోహీరోయిన్లపై రెండు పాటలు చిత్రీకరించి..చివరి పాటను హైద్రాబాద్ లో సెట్స్ వేసి పిక్చరైజ్ చేస్తాం. మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అన్నారు.
ఇక ఈ చిత్రం యూనిట్ మొత్తం కమిలినీ ముఖర్జీ, వేణు లది హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రం కూడా హిట్టయ్యే అవకాసం ఉందని భావిస్తున్నామంటున్నారు. ఇక ఇది పూర్తి కామిడీ చిత్రం. దర్శకుడు ఈశ్వర్ గతంలో సీతారాముల కళ్యాణం..లంకలో, సిద్దు ప్రమ్ శికాకుళం చిత్రాలు నిర్మించారు. గతంలో స్వయంవరం', 'చిరునవ్వుతో', '10 క్లాస్', 'కళ్యాణరాముడు' తదితర చిత్రాలను నిర్మించిన ఎస్.పి.ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్రహ్మానందం, ఆలీ, కోట, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, ఎల్.బి. శ్రీరామ్, రఘుబాబు తదితరులు నటించే ఈ చిత్రానికి కథా విస్తరణ: ఎన్.వి.వి. చౌదరి, బి.సుమంత్, మాటలు: విక్రమ్రాజ్, డుంగ్రోత్ నాగరాజు నాయక్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్, నిర్మాత: పి.వి. శ్యామ్ ప్రసాద్, దర్శకత్వం: జి. ఈశ్వర్.