Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఎనిమిది వందల జీతంతోనే.. :వేణుమాధవ్
వేణు మాధవ్ మాట్లాడుతూ ''నేనిక్కడికి ఏమీ తీసుకురాలేదు. అన్నీ చిత్ర పరిశ్రమే ఇచ్చింది. నాకు దక్కిన గుర్తింపు, గౌరవానికి తగిన న్యాయం చేస్తే చాలనుకొంటుంటాను. ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని అందించినప్పుడే తృప్తి. అలాంటి పాత్రల్నే ఎంచుకొంటున్నా. ఇంతమందిని నవ్వించే అవకాశం లభించడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. దర్శకులు, నిర్మాతలు అందిస్తున్న ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేనిది''అన్నారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ''ఇప్పటిదాకా చేయని ఓ కొత్తరకమైన పాత్రని 'రుద్రమదేవి'లో పోషిస్తున్నాను. అలాగే 'రేయ్', 'మసాలా', 'ఆటోనగర్ సూర్య' తదితర చిత్రాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు దక్కాయి. రానున్న రోజుల్లో మరిన్ని మంచి పాత్రలు చేస్తా'' అన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'మసాలా', 'రేయ్', 'ఆటోనగర్ సూర్య' తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం 'రుద్రమదేవి'తో పాటు అల్లరి నరేష్ సినిమాలోనూ నటిస్తున్నారు.
ఇక వేణు మాధవ్ ఈ రోజుల్లో ఓ పాపులర్ కమిడియన్. ఆ మధ్యన ప్రేమాభిషేకం వీడికి కాన్సర్ లేదు చిత్రంతో హీరోగా కూడా తెరంగ్రేటం చేసిన వేణు మాధప్ ఇప్పుడు కొత్త నీరు రావటంతో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అడపాదడపా పెద్ద హీరోల చిత్రాలలో పాత్రలు చేస్తున్నాడు. మిమిక్రీ చేయగలిగే వేణు మాధవ్ అద్బుతమైన కమిడియన్ అని,లైవ్ లో కూడా బాగా నవ్విస్తాడని సినీ వర్గాలు చెప్తూంటాయి.