Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చనిపోయినట్లు ప్రచారం: పోలీసులను ఆశ్రయించిన వేణు మాధవ్
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ మంగళవారం తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ తో పాటు కొన్ని వెబ్ సైట్లలో తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తుండటంతో షాకైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు.
తనపై ఎవరో కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని.... నిజా నిజాలు నిర్దారించుకోకుండా ఈ విషయాన్ని కొన్ని ఛానల్స్ గుడ్డిగా ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు.
తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారం చూసి తీవ్రమైన మనో వేదనకు గురయ్యానని, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేణు మాధవ్ పోలీసులను కోరారు.
సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత..... ఇలాంటి విషయాలు చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతున్నాయి. కొందరు కావాలని ఇలాంటి తప్పుడు పోస్టులు చేయడం, నిజా నిజాలు నిర్దారించుకోకుండా అందరూ దాని షేర్ చేస్తుండటం లాంటివి చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం తమిళ కమెడియన్ సెంథిల్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. తాను చనిపోయినట్లు మీడియాలో ప్రచారం జరుగడంతో షాకైన ఆయన మీడియా ముందుకు వచ్చి తాను బ్రతికే ఉన్నానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇపుడు అలాంటి పరిస్థితే వేణు మాధవ్ కు ఎదురైంది.