Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సీనియర్ నటి అంజలీదేవికి శతాభిషేకం
సీనియర్ నటి..డాక్టర్ అంజలీదేవికి ఈరోజు (శనివారం) 'శతాభిషేకం' జరుగనుంది. ఈ పంక్షన్ కి శ్రీ సత్యసాయిబాబా ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.అంజలీదేవికి ఎనభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె మనవరాలు విజయలక్ష్మి శుక్రవారం మీడియాకు తెలిపారు. చెన్నై ఆర్ఏ పురంలోని మేయర్ రామనాథన్ చెట్టియార్ కేంద్రంలో ఉదయం 10.30 గంటల నుంచి ఈ అభిషేకం జరుగనుందని నిర్వాహకులు తెలిపారు. కుటుంబసభ్యులు, పలు సినీ, తెలుగు సంస్థలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కరుణానిధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె రోశయ్య, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తదితర రాజకీయ నేతల్ని, సినీ, పారిశ్రామిక ప్రముఖుల్ని ఆహ్వానించారు. అయితే జయలలిత శనివారం ఉదయం చెన్నయ్ నుంచి కొడనాడు ఎస్టేట్కు బయలుదేరి వెళ్లనున్నారు. అందువల్ల ఆమె శుక్రవారమే అంజలీదేవి ఇంటికి వచ్చి శాలువా కప్పి అభినందనలు తెలిపివెళ్లారు. అంజలీదేవి శతాభిషేకంలో పాల్గొని ఆమెను ఆశీర్వదించేందుకే సత్యసాయిబాబా పుట్టపర్తి నుంచి శనివారం నాడు చెన్నయ్ వస్తున్నారు. ఈ సీనియర్ నటీమణికి ఇలాగే మరిన్ని సన్మానాలు, సత్కారాలు జరగాలని ధట్స్ తెలుగు ఆశిస్తోంది.