దర్శకుడు బివిఎల్ ప్రసాద్ ఇక లేరు

ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో కృష్ణ హీరోగా వచ్చిన 'విష్ణు', సుమన్ హీరోగా రూపొంది 'బందిపోటు రుద్రయ్య' చిత్రాలతో పాటు ఉగ్రనేత్రుడు, మాయదారి మరిది, ఇద్దరు మిత్రులు, భాను చందర్ హీరోగా వచ్చిన రౌడీ రాజకీయం తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. మొత్తం 23 చిత్రాలకు ప్రసాద్ దర్శకత్వం వహించారు.
బివిఎల్ ప్రసాద్ మరణంతో టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం నెలకొంది. చాలా ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ.... ఆయనతో పని చేసిన నిన్నటి తరం నటీనటులు ప్రసాద్ పనితీరు, దర్శకత్వం శైలి ప్రత్యేకంగా ఉంటుందని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications