Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రముఖ దర్శకుడు కన్నుమూత !
బొట్టు కాటుక ,సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన దుర్గా నాగేశ్వరరావు ఈ రోజు హైదరాబాద్ లోని రామాంతపూర్ లో కన్ను మూశారు. ఆయన వయసు ఎనభై ఏడేళ్లు .విజయ బాపినీడు నిర్మించిన " విజయ " చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శక రత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు కో డైరెక్టర్ గా పని చేసిన దుర్గా నాగేశ్వరరావు ప్రముఖ నటుడు సి యస్ ఆర్ కు స్వయానా మేనల్లుడు.
ఈ రోజు (బుధవారం) తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం తమ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ముగ్గురు దివంగత దర్శకులకు నివాళులు అర్పించింది. ఈ రోజు (బుధవారం) మరణించిన దుర్గా నాగేశ్వరరావు కు, కొద్ది రోజుల క్రితం మరణించిన ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ కు ,సీనియర్ కో డైరెక్టర్ రామ సూరి కి దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది.
ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ , సీనియర్ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభలో ఈరంకి శర్మ ద్వారా వెండి తెరకు పరిచయమైన నటులు జీ వీ నారాయణ రావు, హేమ సుందర్ ,రూపా దేవి లతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ , ప్రముఖ నిర్మాత కానూరి,దర్శకులు ధవళ సత్యం ,సి వీ రావు, పర్వతనేని సాంబశివరావు, గార సత్యం తదితరులు పాల్గొని దివంగత దర్శకులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు .