Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రముఖ దర్శకుడు కన్నుమూత !
బొట్టు కాటుక ,సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన దుర్గా నాగేశ్వరరావు ఈ రోజు హైదరాబాద్ లోని రామాంతపూర్ లో కన్ను మూశారు. ఆయన వయసు ఎనభై ఏడేళ్లు .విజయ బాపినీడు నిర్మించిన " విజయ " చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శక రత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు కో డైరెక్టర్ గా పని చేసిన దుర్గా నాగేశ్వరరావు ప్రముఖ నటుడు సి యస్ ఆర్ కు స్వయానా మేనల్లుడు.
ఈ రోజు (బుధవారం) తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం తమ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ముగ్గురు దివంగత దర్శకులకు నివాళులు అర్పించింది. ఈ రోజు (బుధవారం) మరణించిన దుర్గా నాగేశ్వరరావు కు, కొద్ది రోజుల క్రితం మరణించిన ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ కు ,సీనియర్ కో డైరెక్టర్ రామ సూరి కి దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది.
ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ , సీనియర్ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభలో ఈరంకి శర్మ ద్వారా వెండి తెరకు పరిచయమైన నటులు జీ వీ నారాయణ రావు, హేమ సుందర్ ,రూపా దేవి లతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ , ప్రముఖ నిర్మాత కానూరి,దర్శకులు ధవళ సత్యం ,సి వీ రావు, పర్వతనేని సాంబశివరావు, గార సత్యం తదితరులు పాల్గొని దివంగత దర్శకులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు .