Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సినిమాని మాట్లాడించిన కలం ఆగిపోయింది :మాటల రచయిత కన్నుమూత
ఎంజీఆర్ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్ రచయిత ఆర్కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు.
ఎంజీఆర్ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్ రచయిత ఆర్కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ రైటర్ ఆర్కే షణ్ముగం స్థానిక లాయిడ్స్రోడ్డులోని ఆయన నివాసగృహంలో మంగళవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు.
ఎంజీఆర్ నటించిన ఆయిరత్తిల్ ఒరువన్, ముగరాశి, నినైత్తదై ముడిప్పవన్, సిరిత్తువాళవేండుమ్, రహస్యపోలీసు 115, పల్లాండు వాళగ వంటి హిట్ చిత్రాలకు ఆయన సంభాషణలు సమకూర్చారు. ఎంజీఆర్ చిత్రాలకు ఆస్థాన సంభాషణల రచయితగా పేరుగడించారు. శివాజీగణేశన్ నటించిన కప్పలోట్టియ తమిళన్ వంటి పలు చిత్రాలకు కూడా ఆయన సంభాషణలు అందించారు.
1980లో ఎంజీఆర్ చేతుల మీదుగా కళైమామణి అవార్డు కూడా అందుకున్నారు. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే షణ్ముగంకు లాయిడ్స్రోడ్డులోని ప్రభుత్వ క్వార్టర్స్లో ఓ ప్లాట్ను ఉచితంగా అందజేశారు. అక్కడే తన రిటైర్డ్ జీవితాన్ని గడిపిన ఈ తమిళ లెజెండరీ రచయిత కన్నుమూత తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖులనీ, ఆయనతో అనుబందం ఉన్న నటులనీ దుఖం లో ముంచింది.