Don't Miss!
- Sports ఓటమి తర్వాత రోహిత్తో ఫ్రాంచైజీ చర్చలు.. హార్దిక్పై వేటు!
- News గోదావరిలో టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై - రెబల్ గా పోటీ..!?
- Automobiles Hero Pleasure Plus Xtec Sports కొనాలనుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
సినిమాని మాట్లాడించిన కలం ఆగిపోయింది :మాటల రచయిత కన్నుమూత
ఎంజీఆర్ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్ రచయిత ఆర్కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు.
ఎంజీఆర్ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్ రచయిత ఆర్కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ రైటర్ ఆర్కే షణ్ముగం స్థానిక లాయిడ్స్రోడ్డులోని ఆయన నివాసగృహంలో మంగళవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు.
ఎంజీఆర్ నటించిన ఆయిరత్తిల్ ఒరువన్, ముగరాశి, నినైత్తదై ముడిప్పవన్, సిరిత్తువాళవేండుమ్, రహస్యపోలీసు 115, పల్లాండు వాళగ వంటి హిట్ చిత్రాలకు ఆయన సంభాషణలు సమకూర్చారు. ఎంజీఆర్ చిత్రాలకు ఆస్థాన సంభాషణల రచయితగా పేరుగడించారు. శివాజీగణేశన్ నటించిన కప్పలోట్టియ తమిళన్ వంటి పలు చిత్రాలకు కూడా ఆయన సంభాషణలు అందించారు.
1980లో ఎంజీఆర్ చేతుల మీదుగా కళైమామణి అవార్డు కూడా అందుకున్నారు. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే షణ్ముగంకు లాయిడ్స్రోడ్డులోని ప్రభుత్వ క్వార్టర్స్లో ఓ ప్లాట్ను ఉచితంగా అందజేశారు. అక్కడే తన రిటైర్డ్ జీవితాన్ని గడిపిన ఈ తమిళ లెజెండరీ రచయిత కన్నుమూత తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖులనీ, ఆయనతో అనుబందం ఉన్న నటులనీ దుఖం లో ముంచింది.