Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎస్పీ బాలుకి వేటూరి పురస్కారం
హైదరాబాద్ : సంగీత సాహిత్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు సేఫ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేటూరి పేరున పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎ.భరద్వాజ్, ప్రభాకర్ తెలిపారు. 2013వ సంవత్సరానికిగానూ ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి వేటూరి జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.
రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావును స్మారక పురస్కారానికి, సంగీతరంగంలో సేవలందిస్తున్న కె.రామాచారిని ప్రశంసా పురస్కారానికీ ఎంపిక చేశామని ప్రకటించారు. ఈ నెల 28న హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలో ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ చేతులమీదుగా ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.
ఈ వేడుకకి అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు, రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ల భరణి, సుద్దాల అశోక్తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, కోన వెంకట్, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు. సేఫ్ హెల్త్ ఫౌండేషన్, ఈటీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక జరగబోతోంది.