Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్ అబద్దాల కోరు!, దాడికిగురైన టెక్కీ స్పందన
ఈ నేపథ్యంలో దాడిగురైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫనీష్ ఓ ఆంగ్లప్రతికతో మాట్లాడుతూ చెర్రీ వ్యాఖ్యాలను ఖండించారు. రామ్ చరణ్కు తాము ఎలాంటి క్షమాపణ చెప్పలేదని స్పష్టం చేసారు. రాష్ డ్రైవింగ్ చేసి రామ్ చరణ్ కారుకు డాష్ ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణల్లోనూ నిజం లేదన్నారు.
తమపై దాడి జరిగిన తర్వాత కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లాము. అయితే వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఫోన్ వచ్చింది. కేసు పెట్టవద్దని, అనవసర ఇబ్బందులు ఎందుకని వారించారని, ఆకారణంగానే తాము కంప్లైంట్ చేయలేదని వెల్లడించారు. పోలీసులు కూడా తమపై ఎలాంటి ఒత్తిడి తేలేదన్నారు.
కాగా.....దాడి జరిగి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా పోలీసులు కేసు నమోదు చేయక పోగా, దానికి బాధితులు ఫిర్యాదు చేయలేదనే సాకు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బున్నోళ్ల కండకావరానికి ఇది నిదర్శనమనే వాదనా వినిపిస్తోంది. సలీం అనే న్యాయవాది ఈ ఘటనపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసారు.
దాడి సంఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలని, బాధితులు ఫిర్యాదు చేయలేదనే కారణంగా కేసు పెట్టక పోవడం వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దాడి కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. న్యాయవాది పిటీషన్ను విచారణకు స్వీకరించిన హెచ్ఆర్సి ఈ వ్యవహారంపై జూన్ 18లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ను ఆదేశించింది.