Don't Miss!
- News మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
ఎన్టీఆర్ బయోపిక్: బసవతారకం పాత్రలో విద్యా బాలన్ లుక్ ఇలా..!
Recommended Video
తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ఒకటి. ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను స్వయంగా నందమూరి బాలకృష్ణ పోషిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. కండిషన్ పెడుతున్నారు.. హీరోయిన్ పూర్ణ!
ఇందులో ఎన్టీ రామారావు సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె లుక్ ఎలా ఉండబోతోందబ రివీలైంది. ఇందుకు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బసవతారకం పాత్రలో విద్య బాలన్ ఇలా
‘ఎన్టీఆర్ బయోపిక్' షూటింగ్ సమయంలో బసవతారకం పాత్రపై సన్నివేశాలు చిత్రీకిస్తున్న సమయంలో విద్యా బాలన్ కాటన్ సారీలో దర్శనమిచ్చారు. ఈ ఫోటో చూస్తుంటే క్రిష్ ఈ పాత్రను ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తున్నారో అర్థమవుతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
శ్రీదేవి పాత్రలో రకుల్
ఈ బయోపిక్ మొదటి భాగం ‘కథా నాయుడు' పేరుతో రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి చూపించబోతున్నారు. హీరోయిన్ శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నారు. ఇందులో ‘ఆకు చాటు పిందె తడిసె' పాటను సైతం రీమిక్స్ చేశారు.
సంక్రాంతికి వస్తున్న కథానాయకుడు
ఎన్టీఆర్ చిన్నతనం, సినిమాల్లోకి ఎలా వచ్చారు, విశ్వా విఖ్యాత నట సార్వభౌముడిగా ఎలా ఎదిగారు అనేది మొదటి భాగంలో చూపించబోతున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబతోంది.
మహానాయకుడు
రెండో భాగం ‘మహా నాయకుడు' చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ అరంగ్రేటం, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం లాంటి ఘట్టాలు చూపించబోతున్నారు. జనవరి 25న ఈ చిత్ర విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా... బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.