Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోదీ టెంట్ అద్భుతంగా ఉంది: విద్యాబాలన్
గుజరాత్ లో తనకు కేటాయించిన టెంట్ అద్భుతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది.
Recommended Video
గుజరాత్ లో తనకు కేటాయించిన టెంట్ అద్భుతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది. ఈ బాలీవుడ్ భామ సురేష్ త్రివేణి దర్శకత్వంలో తుమార్హీ సులు అనే చిత్రం చేసింది. ఈ మూవీ నవంబర్ 17న విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్ కోసం రీసెంట్గా గుజరాత్ వెళ్లింది. ఈ సందర్భంగా గుజరాత్ పర్యాటక శాఖ ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ టెంట్ ని కేటాయించారు.
సినిమాని ప్రమోట్ చేసుకొనే పనిలో పడింది
ఇందులో సోఫా, టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, రెండు బెడ్ రూమ్లు ఉన్నాయి. వాస్తవానికి ఈ టెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కేటాయిస్తారట. . విద్యా ప్రస్తుతం తన సినిమా సినిమా ఈనెల 17న "తుమ్హారీ సులు" ప్రేక్షకుల ముందుకు రానుందిని ఓ రేంజ్లో ప్రమోట్ చేసుకొనే పనిలో పడింది.
సల్మాన్ బిగ్ బాస్ షో
ఇటీవల సల్మాన్ బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి అక్కడ సినిమాకి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంది.. దీనిపై ఆమె మాట్లాడుతూ, "ఆ టెంట్ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్నంతసేపూ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు అనిపించింది' అని చెప్పింది.
ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు
బేగమ్ జాన్ నిరాశ పరిచిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కి ప్రాముఖ్యత ఉన్న పాత్రలోనే విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ తుమ్హారీ సులు, ఈ సినిమా కోసం బాగానే కష్టపడింది, మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో కనిపిస్తున్న విధ్యా బాలన్ అందరికీ తెగ నచ్చేసింది.
రేడియో జాకీ
ఇందులో విద్యది మధ్యతరగతి ఇల్లాలి పాత్ర. అనుకోకుండా రేడియో జాకీగా మారి గుర్తింపు తెచ్చుకుంటుంది.ఆ గుర్తింపు ఆమె కుటుంబ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశంతో ఈ సినమాను డైరెక్టర్ సురేష్ త్రివేణి తెరకెక్కించారు. గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో రేడియోజాకీగా విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే.
సులోచన అలియాస్ సులు
ఈసారి కూడా సులోచన అలియాస్ సులు పాత్రలో విద్యాబాలన్ అద్భుత ప్రదర్శనను కనబరుస్తుందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. సురేశ్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇందులో నేహా దూపియా కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.