Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెల్ ఫోన్ శృంగారమే...విద్యాబాలన్ తొలి తెలుగు సినిమా
బాలాజీ టెలి ఫిలిమ్స్ ద్వారా తానేంటో టెలివిజన్ రంగానికి తెలియచేసి సంచలనంగా మారిన ఏక్తా కపూర్ త్వరలో తెలుగు,హిందీ భాషల్లో 'రాగిణీ ఎంఎంఎస్' అనే చిత్రం నిర్మించనుంది. ఈ మేరకు ఆమె ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభించింది. పవన్ కృపలానీ ఈ చిత్రానికి దర్శకుడు. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని పారానార్మల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందించనున్నారు. ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనున్నది. పారానారమల్ ఏక్టివిటీ, బ్లెయిర్ విచ్ ప్రాజెక్టు, లాంటి హాలీవుడ్ సినిమాల స్పూర్తితో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
ఏక్తా కపూర్ సంస్థ ప్రతినిధి తనూజ్ గార్గ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకొనే అంశాలు 'రాగిణి ఎం.ఎం.ఎస్'లో ఉన్నాయి. అందుకే రెండు భాషల్లోనూ ఒకేసారి చిత్రాన్ని రూపొందించి విడుదల చేయాలని అనుకుంటున్నాం అన్నారు. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
కథ విషయానికి వస్తే...ఇద్దరు ప్రేమికులు తమ శృంగారాన్ని కెమెరాలో బంధించాలనుకొని సెల్ ఫోన్ స్విచాన్ చేసి శృంగారానికి ఉపక్రమిస్తారు. అయితే అంతలోనే ఆమెలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఏదో ఆత్మ ఆమెని ఆవహిస్తుంది. ఈ పరిణామానికి వాళ్ళు షాక్ అవుతారు. ఆ సీన్ ని వాళ్ళు బాలాజీ టెలి ఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ కి చూపించారు. వెంటనే స్పందించిన ఏక్తా ఆ సీన్ చూసి దాని ఆధారంగా 'రాగిణీ ఎంఎంఎస్' సినిమా ప్లాన్ చేసి స్క్రిప్టు సిద్ధం చేయించింది.అయితే ఇందులో అనవసర డ్రామా ఉండదని చెప్తోంది ఏక్తా. ఈ సినిమాకి పబ్లిసిటీ, మార్కెటింగ్ కూడా డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తుంది. ఇక ఇప్పటికే ఆమె సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ అనే చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.