Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హాట్ హాట్ విద్యాబాలన్ ‘డర్టీపిక్చర్’ కి లైన్ క్లియర్..రేపే భారీ విడుదల
రాష్ట్రంలో డర్టీ పిక్చర్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన 'డర్టీ పిక్చర్' చిత్రంపై దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో చిత్రం విడుదలపై వున్న సందిగ్దం విడిపోయింది. తన సోదరి సిల్క్ స్మిత జీవితాన్ని వక్రీకరించి ఈ చిత్రాన్ని నిర్మించారనీ, తమ అనుమతి తీసుకోకుండానే చిత్ర నిర్మాణాన్ని జరిపారనీ స్మిత సోదరుడు నాగవరప్రసాద్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. చిత్రం విడుదల కాకుండా నిలిపి వేయించాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులను ఇంద్రా ఫిలింస్ దక్కించుకుంది. విద్యాబాలన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. నసీరుద్దిన్ షా మరియు ఇమ్రాన్ హష్మి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రేపు (డిసెంబర్ 2) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో విద్యా బాలన్ నటించిన సన్నివేశాలు పాటలు మీడియాకు విడుదల చేయగా భారీ స్పందన లభిస్తోంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో విడులవుతోంది.
అయితే 'ది డర్టీ పిక్చర్" చిత్రంపై పాకిస్తాన్ నిషేధం విధించింది. చిత్ర నిర్మాతలు డిసెంబరు 2న పాకిస్తాన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. ఆ దేశ సెన్సార్ సభ్యులతో కూడిన బృందం విడుదలకి నిరాకరించింది. చిత్ర నిర్మాతలు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించారు.