Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Liger: విజయ్ దేవరకొండ, చిరంజీవికి ఫ్యాన్స్ వార్నింగ్.. చరణ్ సినిమా పోతే పూరీ పార్టీ ఇచ్చాడంటూ!
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోన్న సినిమా పేర్లలో 'లైగర్' ఒకటి. అంతలా ఈ మూవీ నేషనల్ రేంజ్లో ప్రభావాన్ని చూపింది. దీనికి కారణం ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించడంతో పాటు ఇందులో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించడమే. దీనికితోడు ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో రూపొందడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా ఎంతో బజ్తో ఈరోజే 'లైగర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, చిరంజీవి ఫ్యాన్స్ పూరీ జగన్నాథ్ను ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందో మీరే చూడండి!
లైగర్గా వచ్చేసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'లైగర్'. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏకంగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.
శివాత్మక రాజశేఖర్ షాకింగ్ స్టిల్: తొలిసారి ఈ రేంజ్లో అందాల ఆరబోత
గ్రాండ్గా రిలీజ్... థియేటర్లలో రచ్చ
విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'లైగర్' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ విజయ్ దేవరకొండ అభిమానులతో రచ్చతో మోత మోగిపోతున్నాయి.
అంతటా విడుదల... అలాంటి టాక్
క్రేజీ కాంబినేషన్లో రూపొందిన 'లైగర్' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. అయితే, టాక్ మాత్రం అనుకున్న విధంగా రాలేదు. ఎక్కువ శాతం మంది ఈ ప్రతిష్టాత్మక సినిమాపై పెదవి విరుస్తున్నారు.
మోనాల్ గజ్జర్ హాట్ సెల్ఫీ: అద్దంలో ఆ అందాలు కనిపించడంతో!
పూరీ జగన్నాథ్ను టార్గెట్ చేసేశారు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'లైగర్' మూవీపై ఆరంభంలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన 'లైగర్' మూవీకి టాక్ మాత్రం ఊహించని విధంగా వస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు.
విజయ్ దేవరకొండకు వార్నింగ్లు
'లైగర్' మూవీకి వచ్చిన టాక్తో విజయ్ దేవరకొండ అభిమానులు నిరాశగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వాళ్లంతా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఫ్యాన్స్ 'పూరీ జగన్నాథ్లో జన గణ మన మూవీని క్యాన్సిల్ చేసేయ్' అంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పూరీ జగన్నాథ్ను కొత్త కథలతో సినిమాలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత
చిరంజీవికి కూడా ఫ్యాన్స్ హెచ్చరిక
పాన్
ఇండియా
రేంజ్లో
భారీ
బడ్జెట్తో
వచ్చిన
'లైగర్'
మూవీ
టాక్పై
మెగా
అభిమానులు
కూడా
స్పందిస్తున్నారు.
ఈ
మేరకు
కొందరు
ఫ్యాన్స్
ట్విట్టర్లో
'చిరంజీవి
బాస్..
నువ్వు
కానీ
ఆ
పూరీ
జగన్నాథ్కు
ఛాన్స్
ఇస్తే
మంచిగా
ఉండదు'
అంటూ
ఏకంగా
మెగాస్టార్కే
వార్నింగ్
ఇస్తున్నారు.
అంతేకాదు,
పూరీ
క్యారెక్టర్ను
తప్పుబడుతూ
తీవ్రమైన
పదజాలంతో
కామెంట్లు
చేస్తున్నారు.
బ్రూస్లీ పోతే పూరీ పార్టీ ఇచ్చాడని
'లైగర్' మూవీకి సంబంధించిన టాక్ను పక్కనపెడితే.. కొందరు మెగా అభిమానులు ఓ ఆసక్తికరమైన విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. 'చిరంజీవి.. పూరీ జగన్నాథ్తో కమ్బ్యాక్ మూవీని చేద్దామనుకుని ఆపేశాడు. దీంతో బ్రూస్లీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు పూరీ తన బ్యాచ్ మొత్తానికి పార్టీ ఇచ్చాడు' అని ఆరోపిస్తూ కొన్ని ట్వీట్లు చేశారు. దీంతో ఇది హైలైట్ అవుతోంది.