Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Liger Ticket Price: తెలుగు రాష్ట్రాల్లో 'లైగర్' టికెట్ ధరలు ఇవే.. ఎలా ఉన్నాయంటే ?
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ నటించిన చిత్రం లైగర్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్పై సంయుక్తంగా పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టికెట్ ధరలు చర్చనీయాంశమైంది.
దేశవ్యాప్తంగా ప్రమోషన్స్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా కలిసి నటించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 25న విడుదల అవుతున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల వరంగల్లో ఫ్యాన్ డమ్ టూర్ను జోరుగా నిర్వహించారు.
ఫ్యాన్స్ కోలహాలంతో కిక్కిరిసిన గ్రౌండ్..
ఈ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్లో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది అభిమానులు తరలివచ్చారు. ఓ ప్రైవెట్ కాలేజ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయ్, పూరి అభిమానుల కోలహాలంతో కళాశాల గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.
లైగర్కు సాలిడ్ బజ్..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, ఛార్మి, విష్, పూరి జగన్నాథ్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఒక్కొక్కరుగా మాట్లాడుతూ హీట్ పుట్టించారు. వారి మాటలతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ బజ్ను క్రియేట్ చేసుకున్న లైగర్కు ఈ ఈవెంట్తో మరింత హైప్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో హైక్స్..
రోజురోజుకీ మరింత హైప్ క్రియేట్ చేసుకుంటున్న లైగర్ టికెట్ ధరలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా టికెట్ రేట్లు ఎలా ఉండనున్నాయని తెలుస్తోంది. లైగర్కు రెండు రాష్ట్రాల్లో హైక్స్ దక్కినట్లు సమాచారం.
తెలంగాణలో టికెట్ ధరలు..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మల్టి ప్లెక్సుల్లో లైగర్ మూవీ గరిష్ట ధర రూ. 250 కాగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 175గా ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.
ఏపీలో టికెట్ రేట్లు ఎంతంటే?
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మల్టీ ప్లెక్సుల్లో ఉన్న గరిష్ట ధర రూ. 177 కాగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 147గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సో ఈ ధరలతో తెలుగు రాష్ట్రాల్లో లైగర్ తన సత్తా చాటుతుందా? లేదా? అన్నది చూడాలి.