Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
సల్మాన్ ఖాన్ మీద రూ. 250 కోట్ల దావా!
హైదరాబాద్: ఇప్పటికే ఓ వైపు హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడి ప్రస్తుతం బెయిల్ మీద నెట్టుకొస్తున్న సల్మాన్ ఖాన్ కు మరో కష్టం వచ్చి పడింది. సల్మాన్ మీదన్ ‘వీర్' సినిమా నిర్మాత విజయ్ గలానీ రూ. 250 కోట్లకు పరువు నష్టం దావా వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు పంపాడు. సల్మాన్ మూలంగా తన పరువు పోయిందని, మానసిక వేదనకు గురయినట్లు చెబుతున్న గలానీ ఇంత భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ అయింది.
అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘వీర్' చిత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ 10 కోట్లు ఇచ్చేందుకు రెమ్యూనరేషన్ కుదిరిందని, సినిమా బ్రహ్మాండమైన హిట్టయి లాభాలు బాగా వస్తే రూ. 15కోట్లు ఇవ్వాలని ఒప్పందం కుదిరిందని...అయితే సినిమా మూలంగా తాను నష్ట పోయినా 15 కోట్లు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ ఒత్తిడి చేసారని ఆయన అన్నారు.
ఈ వివాదాన్ని తాను నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళితే...సల్మాన్ తన మీద ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసాడని విజయ్ గలానీ తెలిపారు. తన వద్ద ఒప్పంద పత్రం ఉండటం వల్ల కోర్టు తీర్పు తనకే అనుకూలంగా వచ్చిందని, గడచిన మూడేళ్లలో ఈ కేసు కారణంగా, సల్మాన్ ఖాన్ కారణంగా తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, లాయర్లకు ఫిజు రూపంలో భారీగా చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.