క్రేజ్ కోసం: కుమారుడి చిత్రంలో గెస్ట్ గా...
చెన్నై : మగధీర చిత్రంలో చిరంజీవి గెస్ట్ గా కనిపించి తన మెగాభిమానులను అలరించన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటులో విజయ్ కాంత్ కూడా ప్రయాణం పెట్టుకున్నారు. విజయకాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శతాబ్దం'. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. విజయకాంత్ చాలా కాలంగా వెండితెరకు పూర్తి దూరంగా ఉండి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే చిరకాలం తర్వాత ఆయన పాత్ర చేయనుండటంతో ఆ క్రేజ్ తప్పకుండా సినిమాకు యాడ్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.
సింగంపులి, జగన్, పవర్స్టార్ శ్రీనివాసన్, తలైవాసల్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో శింబు ఒక పాట కూడా పాడారు. చిత్రంలో విజయ్కాంత్ గెస్ట్రోల్ను పోషించనున్నట్లు సమాచారం. తన కుమారుడి పరిచయ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారట కెప్టెన్. యాక్షన్ ప్రియులను ఆకట్టుకునే రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. కార్తీక్రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని విజయకాంత్ ఆయన బావమరిది ఎల్కే సుధీష్ నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పొల్లాచ్చి, ఆలియర్డ్యాం, వాల్పారై, ఆనైమలై ప్రాంతాల్లో తెరకెక్కించారు. తర్వాత కుంభకోణంలో 20 రోజుల పాటు చిత్రీకరించారు.
అక్కడ రూ.కోటితో భారీ సెట్ వేసి ఆరు రోజులపాటు ఓ పాటను తెరకెక్కించారు. ఇందులో షణ్ముగపాండియన్, నేహా నటించారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ చిత్రీకరణ మలేషియాలో జరుగుతోంది. కౌలాలంపూర్, లంగావి, బ్యాంకాక్లో 35 రోజులపాటు చిత్రీకరించనున్నారు. మిస్ఇండియా నేహా, బెంగళూరు మోడల్ శుబ్ర అయ్యప్ప హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు.


Click it and Unblock the Notifications











