Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
క్రేజ్ కోసం: కుమారుడి చిత్రంలో గెస్ట్ గా...
చెన్నై : మగధీర చిత్రంలో చిరంజీవి గెస్ట్ గా కనిపించి తన మెగాభిమానులను అలరించన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటులో విజయ్ కాంత్ కూడా ప్రయాణం పెట్టుకున్నారు. విజయకాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శతాబ్దం'. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. విజయకాంత్ చాలా కాలంగా వెండితెరకు పూర్తి దూరంగా ఉండి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే చిరకాలం తర్వాత ఆయన పాత్ర చేయనుండటంతో ఆ క్రేజ్ తప్పకుండా సినిమాకు యాడ్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.
సింగంపులి, జగన్, పవర్స్టార్ శ్రీనివాసన్, తలైవాసల్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో శింబు ఒక పాట కూడా పాడారు. చిత్రంలో విజయ్కాంత్ గెస్ట్రోల్ను పోషించనున్నట్లు సమాచారం. తన కుమారుడి పరిచయ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారట కెప్టెన్. యాక్షన్ ప్రియులను ఆకట్టుకునే రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. కార్తీక్రాజా సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని విజయకాంత్ ఆయన బావమరిది ఎల్కే సుధీష్ నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పొల్లాచ్చి, ఆలియర్డ్యాం, వాల్పారై, ఆనైమలై ప్రాంతాల్లో తెరకెక్కించారు. తర్వాత కుంభకోణంలో 20 రోజుల పాటు చిత్రీకరించారు.
అక్కడ రూ.కోటితో భారీ సెట్ వేసి ఆరు రోజులపాటు ఓ పాటను తెరకెక్కించారు. ఇందులో షణ్ముగపాండియన్, నేహా నటించారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ చిత్రీకరణ మలేషియాలో జరుగుతోంది. కౌలాలంపూర్, లంగావి, బ్యాంకాక్లో 35 రోజులపాటు చిత్రీకరించనున్నారు. మిస్ఇండియా నేహా, బెంగళూరు మోడల్ శుబ్ర అయ్యప్ప హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు.