Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గుండెజారి గల్లంతయ్యిందే... డైరెక్టర్ రహస్యంగా ప్రేమ వివాహం!
మార్చి 1న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 11.23 గంటలకు వీరి పెళ్లి జరిగింది
హైదరబాద్: తెలుగులో ఒక లైలా కోసం, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండ ఓ ఇంటివాడయ్యాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ప్రసూనను పెళ్లాడారు. అయితే వీరి వివాహం ఇండస్ట్రీలోని వారికి గానీ, మీడియాకుగానీ సమాచారం లేకుండా రహస్యంగా జరిగింది.
మార్చి 1న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 11.23 గంటలకు వీరి పెళ్లి జరిగింది. పెళ్లయిన తర్వాత కూడా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచితే బావుండదనే స్నేహితుల సలహా మేరకు.... తనకు పెళ్లయిన విషయాన్ని ఖరారు చేస్తూ అదేరోజు సాయంత్రం పెళ్లి శుభలేఖను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసారు.
ప్రేమ వివాహం
విజయ్ కుమార్ కొండ, ప్రసూన కొంత కాలంగా స్నేహితులు. ఈక్రమంలో ఇద్దరూ ప్రేమికులుగా మారారని, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఇదే పెళ్లి శుభలేఖ
విజయ్ కుమార్ కొండ, ప్రసూన పెళ్లి శుభలేఖ ఇదే. ఇండస్ట్రీకి చెందిన ఎవరికీ ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. కొందరు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారట.
సినిమాలు
2013లో నితిన్ హీరోగా తెరకెక్కించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి హిట్టు కొట్టడంతో నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం' అనే సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు.
చేస్తున్న సినిమాలు
విజయ్ కుమార్ కొండ ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసే ప్లాన్లో ఉన్నాడట. వరుణ్ ప్రస్తుతం మిస్టర్ , ఫిదా అనే చిత్రాలు చేస్తుండగా వీటి తర్వాత తన మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.