twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్క్రీన్‌ప్లే రచయిత విజయ్ టెండూల్కర్ కన్నుమూత

    By Staff
    |
    Vijay Tendulkar
    విమర్శకుల ప్రశంసలు పొందిన 'నిశాంత్', 'ఆక్రోశ్', 'అర్థ్ సత్య' వంటి సినిమాలకు స్క్రీన్‌ప్లేను సమకూర్చిన విజయ్ టెండూల్కర్ ఇక లేరు.ఆయన అనారోగ్యంతో సోమవారం పూనేలోని స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు 80 సంవత్సరాలు. రెండు మాసాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన టెండూల్కర్ స్క్రీన్‌ప్లే రచయితగానే గాక సుప్రసిద్ధ మరాఠీ నాటక రచయిత గా ప్రపంచానికి సుపరిచితుడు. ఆయన రచించిన 'ఘాశీరామ్ కొత్వాల్', 'సఖరమ్ బిందర్' నాటకాలు చాలా పేరుపొందాయి.

    అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా పొందిన ఆయన లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ కింద ఆ అకాడమీ ఫెలోషిప్‌ను పొందారు. అంతేగాక చేసినివి కొద్ది సినిమాలే అయినా బాలివుడ్ లో ఆయన చాలా పేరు సంపాదించారు. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ రూపొందించిన 'మంథన్' సినిమాకు స్క్రీన్‌ప్లేను సమకూర్చింది ఆయనే. దానికి గాను 1977లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డును సాధించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X