Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
దర్శకుడు విజయభాస్కర్ నెక్ట్స్ డిటేల్స్
'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' వంటి హిట్ చిత్రాలకు దర్శకుడు కె.విజయ భాస్కర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత ఓ నూతన చిత్రానికి కమిట్ అయ్యారు. 'కిక్' వంటి చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై సమర్పించిన సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి జూలైలో ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.అచ్చిరెడ్డి చెబుతూ, 'విజయభాస్కర్ దర్శకత్వంలో అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే ఒక మంచి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. సబ్జెక్ట్ పక్కాగా రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా 'ఆది' అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నాం. జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అన్నారు. గతంలో అచ్చిరెడ్డి...మనీషా ఫిలిమ్స్ పతాకంపై 'కొబ్బరిబొండాం', రాజేంద్రుడు-గజేంద్రుడు', 'మాయలోడు', 'యమలీల', 'ఘటోత్కచుడు', 'వినోదం', 'దీర్ఘ సుమంగళీభవ' వంటి హిట్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. విజయ్ భాస్కర్...తరుణ్ తో భలే దొంగలు చిత్రం తర్వాత ఏ చిత్రం కమిట్ కాలేదు.