Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడు విజయభాస్కర్ నెక్ట్స్ డిటేల్స్
'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' వంటి హిట్ చిత్రాలకు దర్శకుడు కె.విజయ భాస్కర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత ఓ నూతన చిత్రానికి కమిట్ అయ్యారు. 'కిక్' వంటి చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై సమర్పించిన సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి జూలైలో ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.అచ్చిరెడ్డి చెబుతూ, 'విజయభాస్కర్ దర్శకత్వంలో అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే ఒక మంచి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. సబ్జెక్ట్ పక్కాగా రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా 'ఆది' అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నాం. జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అన్నారు. గతంలో అచ్చిరెడ్డి...మనీషా ఫిలిమ్స్ పతాకంపై 'కొబ్బరిబొండాం', రాజేంద్రుడు-గజేంద్రుడు', 'మాయలోడు', 'యమలీల', 'ఘటోత్కచుడు', 'వినోదం', 'దీర్ఘ సుమంగళీభవ' వంటి హిట్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. విజయ్ భాస్కర్...తరుణ్ తో భలే దొంగలు చిత్రం తర్వాత ఏ చిత్రం కమిట్ కాలేదు.