Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దర్శకుడు విజయభాస్కర్ నెక్ట్స్ డిటేల్స్
'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' వంటి హిట్ చిత్రాలకు దర్శకుడు కె.విజయ భాస్కర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత ఓ నూతన చిత్రానికి కమిట్ అయ్యారు. 'కిక్' వంటి చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై సమర్పించిన సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి జూలైలో ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.అచ్చిరెడ్డి చెబుతూ, 'విజయభాస్కర్ దర్శకత్వంలో అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే ఒక మంచి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. సబ్జెక్ట్ పక్కాగా రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా 'ఆది' అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నాం. జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అన్నారు. గతంలో అచ్చిరెడ్డి...మనీషా ఫిలిమ్స్ పతాకంపై 'కొబ్బరిబొండాం', రాజేంద్రుడు-గజేంద్రుడు', 'మాయలోడు', 'యమలీల', 'ఘటోత్కచుడు', 'వినోదం', 'దీర్ఘ సుమంగళీభవ' వంటి హిట్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. విజయ్ భాస్కర్...తరుణ్ తో భలే దొంగలు చిత్రం తర్వాత ఏ చిత్రం కమిట్ కాలేదు.