Don't Miss!
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
నటి, దర్శకురాలు విజయ నిర్మల ఇక లేరు.. విషాదంలో టాలీవుడ్
Recommended Video
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నటుడు వీకే నరేష్ తల్లిగా
తమిళనాడులో స్థిరపడిన కుటుంబంలో విజయ నిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల. నటుడు వీకే నరేష్కు తల్లి. జయసుధకు పిన్ని అవుతారు. విజయశాంతికి కూడా ఆమె బంధువులు అవుతారు.
పాతూరులోని బాల్యం
విజయనిర్మల తల్లి శకుంతల. సోదరులు వసంతరావు, సంజీవరావు. పాతూరులో విజయ నిర్మల కుటుంబాలు ఉండేవి. విజయనిర్మల బాల్యం కూడా అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి మద్రాస్ వెళ్లిపోయారు. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు.
ఏడో ఏటనే బాలతారగా
తన
ఏడో
ఏటనే
1950లో
బాలతారగా
మత్స్యరేఖ
అనే
తమిళ
చిత్రం
ద్వారా
సినీ
రంగంలోకి
ప్రవేశించారు.
11వ
ఏట
పాండురంగ
మహాత్యం
అనే
చిత్రం
ద్వారా
తెలుగు
చిత్ర
పరిశ్రమలోకి
ప్రవేశించారు.
రంగులరాట్నం
సినిమాతో
హీరోయిన్గా
మారారు.
సుమారు
200
పైగా
చిత్రాల్లో
ఆమె
నటించారు.
తెలుగు,
తమిళ
మలయాళ
చిత్రాల్లో
తన
ప్రతిభను
చాటుకొన్నారు.
గిన్నిస్ బుక్లోకి విజయ నిర్మల
విజయ
నిర్మల
నటిగా
కొనసాగుతూనే
దర్శకురాలిగా
మారారు.
సుమారు
44
చిత్రాలకు
దర్శకత్వం
వహించారు.
సినీ
పరిశ్రమలో
మహిళా
దర్శకురాలిగా
ఇదో
రికార్డు.
2002లో
అత్యధిక
చిత్రాలు
రూపొందించిన
మహిళా
దర్శకురాలిగా
ఆమె
గిన్నిస్
బుక్
రికార్డులోకి
ఎక్కారు.
డైరెక్టర్గా
దర్శకురాలిగా మీనా అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించారు. అప్పటి నుంచి 2009 వరకు మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువులు ఆరుకాయలు, హేమా హేమీలు, రాం రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది. భోగి మంటలు, లంకె బిందెలు, రెండు కుటుంబాల కథ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. 2009 నేరం-శిక్ష దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం.