Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తెలంగాణలో 'బాద్షా' బహిష్కరణ ప్రకటన
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్షా' చిత్రాన్ని తెలంగాణ ప్రాంతంలో బహిష్కరిస్తున్నట్లు తెరాస ఎంపీ విజయశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చలనచిత్ర ఆడియో విడుదల ఉత్సవంలో జరిగిన అపశ్రుతిలో వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే యువకుడు చనిపోయాడని, అతడి మృతికి కనీసం సంతాపం తెలపకుండా కార్యక్రమాన్ని కొనసాగించారని, ఇది సీమాంధ్ర దురహంకారానికి నిదర్శనమని, దీనికి నిరసనగా తెలంగాణలో ఈ చిత్రాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు.
నిర్మాత బండ్ల గణేశ్ మృతుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థి క సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచా రం వ్యక్తం చేశారు. కాగా, హీరో ఎన్టీఆర్ స్టేజీ పైకి చేరుకుని వరంగల్ జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంజా రాంబాబు పిలిపించుకున్నాడు. ఈ సందర్భం గా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ తల్లికి కుమారున్ని ఇవ్వలేను కానీ, చనిపోయిన కుటుంబానికి పెద్దకుమారుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అభిమానులు ఇళ్లకు జాగ్ర త్తగా వెళ్లాలని అభిమాని మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆడియో ఆవిష్కరణ గురించి మాటమాత్రమైన మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా ఆడియో విడుదల వేడుకలో అపశ్రుతి చోటుచేసుకొంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ శివారు నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియో ఆవరణలో నిర్వహించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఎన్టీఆర్ ప్రాంగణానికి వస్తున్నట్లు ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ప్రవేశద్వారం వద్దకు చేరుకొన్నారు.
ఆ సమయంలో తొక్కిసలాట జరగటంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. వరంగల్లోని ఉర్సుగుట్టకు చెందిన ముక్కల రాజు(22)అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్ తదితరులపై రాయదుర్గ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పరిమితికి మించి పాస్లను జారీ చేయడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 3 వేల వీవీఐపీ సీట్ల సామర్థ్యం ఉండగా 20 వేల మందికి పైగా పాస్లు మంజూరు చేసినట్లు తెలిసింది. కార్యక్రమానికి అనుమతి ఉన్నప్పటికీ ఎక్కువ పాస్లు జారీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సైబరాబాద్ పోలీసుకమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.