Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సరైన సమయంలో మళ్లీ తెరపైకి వచ్చా.. చాలామంది ఫోన్ చేస్తున్నారు: విజయశాంతి
లేడీ అమితాబ్గా తెలుగు తెరపై సూపర్ పాపులారిటీ సంపాదించింది విజయశాంతి. సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆమె అందరు అగ్ర హీరోల సరసన నటించింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిన ఆమె.. తిరిగి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. భారతిగా ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంది. ఈ సందర్బంగా కాసేపు మీడియాతో ముచ్చటించిన విజయశాంతి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.
చాలా సంవత్సరాల నుంచే అనేక మంది డైరెక్టర్లు సినిమా చేయమని అడుగుతున్నారు. కానీ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల మళ్లీ నటించాలనే ఆలోచన రాలేదు. సినిమా అంటే సమయం కేటాయించాలి. ఇటు సినిమాల పరంగా, అటు రాజకీయపరంగా ఇబ్బంది పడలేను. గతంలో ఒకసారి అనిల్ రావిపూడిగారు సినిమా కోసం సంప్రదించారు. కానీ కుదరలేదు. ఈ సారి దర్శకులు అడిగినప్పుడు కొంత విరామం ఉంది. పైగా మహేష్ బాబు హీరో అనడంతో ఓకే చెప్పాను అని విజయశాంతి తెలిపింది.
ఇన్నేళ్లకు తిరిగి కెమెరా ముందుకు రావడం తనకేమీ కొత్తగా అనిపించలేదని విజయశాంతి చెప్పింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే. అలా సరైన సమయంలో విరామం తీసుకున్నా. సరైన సమయంలో మళ్లీ తెరపైకి వచ్చా అని విజయశాంతి తెలిపింది. సరిలేరు నీకెవ్వరుతో చాలా పెద్ద హిట్ను ప్రేక్షకులు ఇచ్చారు. చాలామంది ఫోన్లు చేసి నన్ను అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయని విజయశాంతి పేర్కొంది.