Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్గా సాయి కుమార్
విజయవాడ సిటీ పోలీసు శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటుడు సాయి కుమార్ నిమితులయ్యారు. సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు అంగీకరించినందుకుగాను నగర పోలీస్ కమీషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ పోలీసులు ‘నాలుగో సింహం' పేరుతో ఓ యాప్ రూపొందించారు. జూన్ 21న సాయి కుమార్ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల చేయనున్నారు. విజయవాడ కమీషనరేట్ పరిధిలో పోలీసులు పలు ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సాయి కుమార్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు.
తెలుగులో సాయికుమార్ నటించిన ‘పోలీస్ స్టోరీ' చిత్రం పెద్ద హిట్టయింది. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనే రీతిలో ఈ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో పాతుకు పోయింది. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే...కనిపించని ఆ నాలుగో సింమేరా పోలీస్ అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ ఎవరూ మరిచిపోలేనంతగా పాపులర్ అయింది.