Don't Miss!
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
2 కోట్లకు డీల్ సెట్టయింది: బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్
హైదరాబాద్: విజయేంద్ర ప్రసాద్... తెలుగు ప్రముఖ రచయితల్లో ఒకరు. అంతకు ముందు ఆయన చాలా సినిమాలు చేసినా దేశ వ్యాప్తంగా బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం బాహుబలి, బజరంగీ భాయిజాన్ చిత్రాల తర్వాతే. 2015లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలైన ఈ చిత్రాలు రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసాయి.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన'బాహుబలి' చిత్రం దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. సౌత్ నుండి వచ్చిన ఒక చిత్రం ఉత్తరాధిన భారీ విజయం సాధించడం అదే తొలిసారి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన 'బజరంగీ భాయి జాన్' చిత్రం కూడా బాలీవుడ్లో భారీ విజయం సాధించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ 'బజరంగీ భాయిజాన్' చిత్రానికి సంబంధించిన విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కథ అందించినందుకు గాను తనకు తొలుత రూ. 40 లక్షలు ఆఫర్ చేసారని, తాను రూ. 2.5 కోట్లకంటే ఒక పైసా తక్కువకు కూడా స్టోరీ ఇవ్వనని చెప్పాను. చివరకు రూ. 2 కోట్లు డీల్ సెట్టయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి' సీక్వెల్స్ కు సంబంధించిన కథలు రాయడంలో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ బాహుబలి-2కు స్ర్కిప్టు రాయడం పూర్తయింది...షూటింగు కూడా మొదలైంది. దీని తర్వాత బాహుబలి-3 కూడారాబోతోందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు.