Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కథ విషయంలో భేదాభిప్రాయాలు.. రాజమౌళి అనుకున్నట్లే చేస్తాడు.. విజయేంద్ర ప్రసాద్!
Recommended Video
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. రాజమౌళి చిత్రాలకు తన ఫ్యామిలీ సహకారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాము ఇంట్లో ఒకలా, సెట్స్ లో మరోలా ఉంటాం అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఊహించలేదు
విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. తన కుమారుడు ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని అసలు ఊహించలేదు. ప్రస్తుతం తాను రాజమౌళి పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. తామిద్దరం ఇంట్లో ఇప్పటి మోడ్రన్ తండ్రీ కొడుకుల్లా స్నేహితుల్లా ఉండం. ఇంట్లో తండ్రిగా నాదే ఆధిపత్యం. తాను పాతతరం తండ్రిలాగే ప్రవర్తిస్తుంటానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
కథని అద్భుతంగా
రాజమౌళితో కథని అద్భుతంగా చెప్పగలిగే నైపుణ్యం ఉందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంట్లో తాను ఆధిపత్యం చెలాయిస్తే.. సెట్స్ లో మాత్రం అతడే బాస్. నేను రచయితని మాత్రమే అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దర్శకుడు కాకముందు నుంచే నాకు కథ విషయంలో రాజమౌళి సాయం చేసేవాడు. అలా దర్శకత్వ నైపుణ్యాలు పెంచుకున్నాడు అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
భేదాభిప్రాయాలు
సినిమా స్క్రిప్ట్ విషయంలో భేదాభిప్రాయాలు గురించి మాట్లాడుతూ.. అవి మామధ్య ఎప్పుడూ ఉండేవే. నేను చెప్పిన విషయాలని రాజమౌళి చాలా సంధర్భాల్లో ఒప్పుకోలేదు. తాను అనుకున్నదే చేస్తాడు అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. కెప్టెన్ అతడే కాబట్టి నేను అంగీకరించాల్సిందే అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చాలా కాలం పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రారంభించాడు.
కల్పిత గాధగా
ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. 1920 కాలంలో స్వాతంత్ర నేపథ్యంలో జరిగే ఈ కథని కల్పిత గాధగా రాజమౌళి చూపించబోతున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.