Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఈ నెల 9న రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండుగ
హైదరాబాద్ : రజనీ ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్ ఇది. ఇదిగో వస్తోంది.. అదిగో వస్తోంది అంటూ ఇన్నాళ్లూ వూరిస్తూ వచ్చిన రజనీకాంత్ 'విక్రమ సింహ' టీజర్ విడుదలకు సిద్ధమైంది. ఈ టీజర్ ని కాన్స్ ఉత్సవాల్లో విడుదల చేస్తారంటూ తొలుత వార్తలొచ్చాయి. కానీ వాయిదా వేసుకుంటూ వచ్చింది చిత్ర బృందం. ఇప్పుడు ఈ నెల 9న విడుదల చేస్తామంటూ ఆదివారం సౌందర్య ట్విట్టర్లో పేర్కొన్నారు. దాంతో రజనీకాంత్ ఫ్యాన్స్ మొత్తం ఆ రోజు పండుగ చేసుకుంటారని చెప్తున్నారు. ఆ రోజు చాలా హడావిడిగా ఉంటుందని కోలీవుడ్ సమాచారం.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. దీపికా పదుకొణే హీరోయిన్ . రజనీ తనయ సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ త్రీడీ విధానంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీపావళికి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'కొచ్చాడయాన్' తమిళ సినిమా కాదని, అంతర్జాతీయ చిత్రం అని వ్యాఖ్యానించారు ఆచిత్ర హీరోయిన్ దీపిక పదుకొనె. దేశీయ బాషలైన హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్, రష్య, జపాన్, చైనా బాషలలో విడుదలవుతుందని, రజనీకాంత్ అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటుడని ఆమె చెప్పుకొచ్చారు.
విక్రమ్ సింహా 3డిలో రూపొందుతున్న ఈచిత్రం యానిమేషన్, గ్రాఫిక్స్ తో విజువల్ ట్రీట్లా ఉంటుందని దీపిక తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు.
శరత్కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ హీరో కావడం, అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, ఛాయాగ్రహణం: రాజీవ్మీనన్