Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దీక్షా సేథ్ చెప్పులు మోసిన హీరో
హీరోయిన్ దీక్షాసేథ్ తమిళంలో తొలిసారిగా 'రాజపట్టయ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో 'వీడింతే' పేరుతో ఈ నెలాఖరున విడుదల కానుంది. గతంలో కార్తీతో 'నా పేరు శివ'చిత్రం డైరక్ట్ చేసిన సుశీంద్రన్ ఈ సినిమాని డైరక్ట్ చేసారు. ఈ సినిమా గురించి దీక్షసేథ్ మాట్లాడుతూ...గతంలో వచ్చిన చిత్రాల కంటే ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని తెలిపారు. విక్రమ్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత కొంత ఉద్వేగానికి గురయ్యా, కానీ ఆయనతో పని చేయడం చాలా ఈజీ అనిపించింది. ఆయన ఫ్రెండ్లీ నేచర్ నచ్చింది అని చెప్పింది.
ఇటలీలో షూటింగ్ జరిగినప్పుడు మంచులో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చెప్పులు కూడా వేసుకోలేదు. సీన్ అయిపోగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చున్నా. నా అవస్థ చూడలేక విక్రమం నా చెప్పులు చేత్తో పట్టుకుని వచ్చారు. అంత పెద్ద స్టార్ ఆ పని చేయడంతో నా నోట మాటరాలేదు. ఆయన ఇంత స్నేహంగా ఉంటారని అప్పుడే తెలిసింది. ఆయన చాలా మంచి వ్యక్తి. తమిళంలో తొలి సినిమా ఆయనతో చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.