Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వైరల్ పిక్: పవన్ కల్యాణ్ను కలిసిన త్రివిక్రమ్.. తెరపైకి సరికొత్త అనుమానాలు.!
పవన్ కల్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది మందితో మాత్రమే సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. అందులో బడా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. వీరిద్దరూ చాలా కాలంగా స్నేహంగా ఉంటున్నారు. 'జల్సా' సినిమా సమయంలో ప్రారంభమైన బంధం నేటికీ కొనసాగుతోంది. మధ్యలో మరో రెండు సినిమాలు వీరి మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేశాయి. పవన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాలోనే నటించాడు. తాజాగా ఈ ఇద్దరూ కలుసుకున్నారు. దానికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరు ఎందుకు మీట్ అయ్యారు.? పూర్తి వివరాల్లోకి వెళితే...
అదొక్కటే బాగా నిరాశకు గురి చేసింది
పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అందులో ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' సినిమాలు మంచి హిట్టు కాగా, ‘అజ్ఞాతవాసి' మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే డిజాస్టర్ మూవీగా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ బాగా నిరాశకు గురయ్యారు.
పవన్ కల్యాణ్ మళ్లీ వస్తున్నాడు
‘అజ్ఞాతవాసి' తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. ఇది వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోయింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘పింక్' రీమేక్ ద్వారా ఆయన మరోసారి సినిమాల్లోకి వస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఎంపికయ్యారని తెలిసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్తో పవన్ సినిమా
వాస్తవానికి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా గడపుతున్న సమయంలో త్రివిక్రమ్తో సినిమా చేయబోతున్నారన్న వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. అంతేకాదు, నిర్మాత కూడా ఫిక్స్ అయ్యారని అన్నారు. చాలా రోజుల పాటు ఇలా వార్తలు రావడంతో నిజమేనేమో అని అనుకున్నారంతా. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది.
చిరంజీవిలా ప్రయత్నిస్తున్న పవన్
‘పింక్' రీమేక్ కోసం పవన్ కొన్ని డేట్స్ కేటాయించాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన దీని తర్వాత మరో సినిమాను కూడా చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తాడని అంటున్నారు. పిరియాడిక్ డ్రామాగా ఇది రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. చిరు ‘సైరా'లా ఈ మూవీ ఉంటుందని సమాచారం.
పవన్ కల్యాణ్ను కలిసిన త్రివిక్రమ్
తాజాగా
పవన్
కల్యాణ్ను
త్రివిక్రమ్
శ్రీనివాస్
కలిశారు.
దానికి
సంబంధించిన
పిక్
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోంది.
దీంతో
వీళ్లిద్దరి
కాంబోలో
సినిమా
వస్తుందని,
అందుకే
ఆ
కథ
చెప్పడానికే
మీటింగ్
జరిగిందని
ఎన్నో
వార్తలు
ప్రచారం
అవుతున్నాయి.
అంతేకాదు,
ఈ
మీటింగ్పై
పలువురు
పలు
రకాలుగా
అనుమానాలను
వ్యక్తం
చేస్తున్నారు.