Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రహస్యంగా అనుష్క-విరాట్ పెళ్లి ఏర్పాట్లు, ఆశ్రమం విడిచి వెళ్లిన బాబా!
బాలీవుడ్ నటి అనష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లి పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అయింది. అనుష్క మేనేజర్ అలాంటిదేమీ లేదని బుకాయిస్తున్నప్పటికీ విరుష్క పెళ్లి వేడుకకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉండటం గమనార్హం.
ఈ నెల 12న అనుష్క-విరాట్ పెళ్లి జరుగనుందని మొదట ప్రచారం జరిగినా.... తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 15న పెళ్లి వేడుక జరుగనుందని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుక ఇండియాలో కాకుండా ఇటలీలో ప్లాన్ చేశారని తెలుస్తోంది.
గుట్టు చప్పుడుకాకుండా ఏర్పాట్లు
అనుష్క-విరాట్ కోహ్లి పెళ్లి ఏర్పాట్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. కోహ్లి, అనుష్క సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీలోని మిలాన్కు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన ఆధ్వర్యంలోనే పెళ్లి వేడుక, అందుకే రహస్యంగా
అనుష్క కుటుంబ గురువు మహారాజ్ అనంత్ బాబా ఆధ్వర్యంలో ఈనెల 15న అనుష్క-విరాట్ పెళ్లి వేడుక జరుగనుందని తెలుస్తోంది. మీడియాకు తెలిస్తే అనవసర ఇబ్బందులు వస్తాయనే కారణంతోనే ఈ పెళ్లి తంతు రహస్యంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.
బాబా ఆశ్రమం విడిచి వెళ్లడంతో మరింత క్లారిటీ
అనుష్క కుటుంబం తరచూ హరిద్వార్లోని అనంత్ బాబాను కలుస్తూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం అనుష్క వచ్చి బాబాను కలిసిందని, ఆ తర్వాత నవంబర్ 28న ఆశ్రమంలో కొంత మంది సిబ్బంది ముఖ్యమైన కార్యక్రమం కోసమని ఆశ్రమం నుండి వెళ్లారని, డిసెంబర్ 2న బాబా కూడా హరిద్వార్ నుంచి వెళ్లిపోయారని, ఆయన మళ్లీ డిసెంబర్ 15 తర్వాతే వస్తారని ఆశ్రమ వర్గాలు చెప్పడంతో..... బాబా వెళ్లింది అనుష్క-విరాట్ పెళ్లి వేడుక కోసమే అని అంటున్నారు.
టస్కానీ వేదికగా పెళ్లి, ముంబైలో విందు
ఇటలీలోని విలాసవంతమైన బంగ్లా టస్కానీ వేదికగా అనుష్క-విరాట్ కోహ్లి పెళ్లి వేడుక జరుగనుందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ముంబయిలో డిసెంబర్ 26న భారీ పెళ్లి విందు ఇవ్వనునట్లు సమాచారం.
పక్కా ప్లానింగుతో
అనుష్క-విరాట్ కోహ్లి తమ పెళ్లి వేడుకను పక్కా ప్లానింగుతో చేసుకుంటున్నారు. దానికి ప్రకారమే విరాట్ కోహ్లీ బిసీసీఐ అనుమతితో క్రికెట్ నుండి కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు. అనుష్క కూడా తన సినిమా కమిట్మెంట్లకు బ్రేక్ వేసింది. పెళ్లి పూర్తయిన తర్వాత జనవరి 4న తమ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.
కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం
ఈ పెళ్లి వేడుకకు కొద్దిమందికి మాత్రమే ఆహ్వానాలు అందాయట. క్రికెట్ నుండి సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ తదితరులు ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ నుండి. షారుఖ్ఖాన్, ఆమిర్ఖాన్, దీపికా పదుకోన్, ఆదిత్యచోప్రా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.