twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జనం కోసం ఒక్కటై ఎన్టీఆర్, కోహ్లీ.. ఊహించని మార్పు ఖాయం

    |

    Recommended Video

    Jr NTR To Collaborate With Virat Kohli || Filmibeat Telugu

    ఒకరు సినీ దిగ్గజం, మరొకరు క్రికెట్ దిగ్గజం.. ఇద్దరికీ అశేష అభిమాన వర్గం. వెండితెరపై ఒకరు కింగ్ అయితే గ్రౌండ్ లో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తూ బుల్లితెర ఆడియన్స్‌లో జోష్ నింపే వ్యక్తి మరొకరు. ఇప్పటికే ఆ ఇద్దరూ ఎవరో మీరు గెస్ చేసి ఉంటారు. మరి ఆ ఇద్దరూ ఒక్కటై ఒకే తెరపై ప్రత్యక్షమైతే.. ఇంకేముంది ఆ సంచలనాలు ఉహించగలమా! మీరే చెప్పండి. అలాంటి ఓ అరుదైన సందర్భం మరికొద్ది రోజుల్లోనే మీ ముందుండనుంది. వివరాల్లోకి పోతే..

    తారక్‌ జోడీగా విరాట్ కోహ్లీ

    తారక్‌ జోడీగా విరాట్ కోహ్లీ

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒకే తెరపై చూసే అరుదైన అవకాశం దగ్గరలోనే ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కోసం క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. ప్రాణాల విలువ తెలిపేలా సామాజిక కోణంలో జరగనున్న ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో తారక్‌, విరాట్ కోహ్లీ జోడీ విలువైన సూచనలు ఇవ్వనుంది.

    మ‌ద్యం సేవించి వాహ‌నాలు నడుపుతూ

    మ‌ద్యం సేవించి వాహ‌నాలు నడుపుతూ

    ఈ రోజుల్లో మ‌ద్యం సేవించి వాహ‌నాలు నడిపే వారు చాలా ఎక్కువైపోయారు. ఈ కారణంగా నిత్యం ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అలాగే రోజూ కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. అయినా మ‌ద్యం సేవించి వాహ‌నాలు నడిపే వారి సంఖ్య తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పోలీసులు పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఏ మాత్రం రిసల్ట్ కనిపించడం లేదు.

     రంగంలోకి ఎన్టీఆర్, విరాట్ కోహ్లీ

    రంగంలోకి ఎన్టీఆర్, విరాట్ కోహ్లీ

    మ‌ద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గాను తమ వంతు సహకారంతో రంగంలోకి దిగబోతున్నారు ఎన్టీఆర్, విరాట్ కోహ్లీ. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను పెంచేందుకు గాను ఎన్‌డిటివి వారు కండక్ట్ చేయబోతున్న అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ లో భాగమై తమ విలువైన సూచనలు ఇవ్వనున్నారట ఎన్టీఆర్, విరాట్ కోహ్లీ. ఈ ప్రోగ్రామ్‌లో వీరితో పాటు వివిధ రంగాల‌కు చెందిన ఏడుగురు సెల‌బ్రిటీలు ప్ర‌చారక‌ర్త‌లుగా ప‌నిచేయ‌నున్నారని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

    ఇరువురి అభిమానులు ఖుషీ ఖుషీ..

    ఇరువురి అభిమానులు ఖుషీ ఖుషీ..

    అత్యంత ఆదరణ కలిగిన ఓ క్రికెటర్, మరో సినీ హీరో కలిసి ప్రజా శ్రేయస్సు కోరుతూ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ లో పాల్గొనడం అభినందించదగ్గ విషయం. పైగా భారీ ఫాలోయింగ్ ఉన్న కోహ్లీ, తారక్ లాంటి వారు సూచనలు ఇస్తే ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ విషయం బయటకు రావడంతో తారక్, కోహ్లీ ఇరువురి అభిమానులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.

    ఆర్ఆర్ఆర్ లో తారక్, ప్రపంచ కప్‌లో కోహ్లీ

    ఆర్ఆర్ఆర్ లో తారక్, ప్రపంచ కప్‌లో కోహ్లీ

    ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు తారక్. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు ప్రపంచ కప్‌ టోర్నీలో వీరోచితంగా పోరాడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ సారి ప్రపంచ కప్ భారత్‌దే అన్నట్లుగా సాగుతోంది విరాట్ కెప్టెన్సీ.

    English summary
    Indian Cricket captain Virat Kohli and young tiger ntr will going to participate a awareness program which is conducted by NDTV
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X