విశాఖలో చిరు ర్యాలీ
చిరంజీవి రాజకీయాలలోకి వెంటనే రావాలని ఆయన అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్నారు. ఎపుడొస్తారా అని తహతహలాడుతున్నారు. రాష్ట్రమంతటా ర్యాలీలు, సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం విజయవాడలోని ఐవీ ప్యాలెస్ లో సభ నిర్వహిస్తే శనివారంనాడు విశాఖపట్టణంలో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. నటుడిగా ఉన్నపుడే సామాజిక సేవలను విస్తృతంగా చేపట్టిన చిరంజీవి రాజకీయాలలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని వారు అభిప్రాయ పడ్డారు. చిరంజీవి వలన యువతకు ఎంతో లాభం చేకూరుతుందని వారంటున్నారు.


Click it and Unblock the Notifications











