Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
విశాల్ 'పల్నాడు' స్టోరీ లైన్
విశాల్ మాట్లాడుతూ ''ఇప్పటిదాకా హీరోగానే మాట్లాడాను. తొలిసారి నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఈ సినిమా వెనక చాలా కష్టం ఉంది. అదంతా ఇష్టంతోనే చేశాను. ప్రతీ హీరో జీవితంలోనూ ఓ మలుపు అనేది ఉంటుంది. అది దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ విన్నాక కూడా నాకు ఓ మంచి మలుపునిచ్చే చిత్రమవుతుందనిపించింది. నాలో ఆవేశం, సినిమాపై వున్న ప్రేమవల్ల నిర్మాతనయ్యాను. 'పల్నాడు' అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమవుతుంది. ఇక తెలుగు సినిమా గురించి ప్రతీసారీ చెబుతూనే ఉన్నాను. నేను నిర్మాతగా మారడం వల్లే నా తెలుగు సినిమా ఆలస్యమైంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నా'' అన్నారు.
అలాగే "దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఎవరికైనా ఏదో ఒక సమయంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. సుశీంద్రన్ ఈ కథ చెప్పినప్పుడే ఇది అలాంటి కథ అనిపించింది. నా కెరీర్కు ఇది చాలా ముఖ్యమైన చిత్రం.ఇప్పటికే మా కుటుంబానికి ఓ బ్యానర్ ఉన్నప్పటికీ, ఈ సినిమా నిర్మాణాన్ని నేనే స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశంతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశాను. వచ్చే సంక్రాంతికి తెలుగులో శశి దర్శకత్వంలో ఓ స్ట్రయిట్ సినిమా చేయబోతున్నా'' అని చెప్పారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ ''విశాల్ నాకు ఓ అన్నయ్యతో సమానం. ఎప్పట్నుంచో ఆయన సినిమాలు చూస్తున్నాం. ఎంతో అణిగిమణిగి ఉంటారు. సుశీంద్రన్ దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. తను పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీస్తుంటాడు. పాటలు, ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి. తప్పకుండా ఇదొక మంచి చిత్రమవుతుంది''అన్నారు. మహత్ రాఘవేంద్ర మాట్లాడుతూ ''విశాల్ నాకు మంచి మిత్రుడు. సినిమాకోసం ఎంతైనా కష్టపడతుంటారు. సిక్స్ ప్యాక్ చేయమన్నా చేస్తారు, ఇటున్న కళ్లను అటువైపు తిప్పడానికైనా సిద్ధపడతారు. నిర్మాతగా, హీరోగా విశాల్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ చిత్రం తప్పకుండా ఒక మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది'' అన్నారు.
తులసి, ప్రకాశ్, విక్రాంత్, సూరి, భారతీరాజా తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, కూర్పు: ఆంటోని, కళ: రాజీవన్, ఫైట్స్: అణల్ అరసు, నిర్మాణ సారథ్యం: వడ్డి రామానుజం, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుశీంద్రన్