Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టులో ఊరట
దక్షిణాది హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల మండలిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యాలు చేశారనే కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
దక్షిణాది హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల మండలిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యాలు చేశారనే కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాలపై సస్సెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. మండలి విధించిన సస్సెన్షన్ ను సవాల్ చేస్తూ విశాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే విశాల్ పై విధించిన వేటును ఉపసంహరించుకొంటామని విచారణ సందర్భంగా మండలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అందుకు విశాల్ బేషరుతుగా క్షమాపణలు చెప్పారు.
కానీ ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎతివేయలేదు. సభ్యుడిగా మళ్లీ కమిటీలో చేర్చుకోలేదు. దాంతో మళ్లీ విశాల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం విశాల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
శుక్రవారం లోగా విశాల్ పై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని, ఆయనను మళ్లీ కమిటీలో చేర్చుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాల్ విజయం సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.