Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్లేబోయ్ గా మారి విశాల్ ముగ్గురు హీరోయిన్స్ తో...
పందెంకోడి చిత్రంతో తెలుగువారికి దగ్గరైన విశాల్ త్వరలో ప్లేబోయ్ అవతారమెత్తి ముగ్గురు హీరోయిన్స్ తో ఆడుకోనున్నాడు. 'కిలాడి' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటివారంలో విడుదల చేయటానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత విక్రమ్ కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ...' విశాల్ ఇంతవరకూ పోషించని ప్లేబోయ్ పాత్రను ఈ చిత్రంలో పోషించాడు. తను ఏ విషయంలోనైనా ఓ నిర్ణయం తీసుకునే ముందు మూడు రకాలుగా ఆలోచించడం ఈ హీరోకి అలవాటు. అలాగే తన జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిల్ని అనుకుంటాడు. ఇంతకీ విశాల్ ఆడుకోబోయే ముద్దుగు ముద్దుగుమ్మలూ...తనుశ్రీదత్తా, నీతూచంద్ర, సారాజైన్. ఈ ముగ్గురిలో ఎవరిని ఈ కిలాడి సొంతం చేసుకుంటాడన్న అంశాన్ని ఆసక్తికరమైన కథనంతో చిత్రీకరించాం. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, లవ్ అంశాలతో సాగే ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో వీటిని చిత్రీకరించాం. అన్ని తరగతుల వారిని అలరించే చిత్రమవుతుంది' అన్నారు. జి.కె. ఫిలిం కార్పొరేషన్ పతాకంపై విక్రమ్కృష్ణ నిర్మించిన ఈ 'కిలాడి' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 15కల్లా తొలి కాపీ వస్తుందని అన్నారు.