Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్లేబోయ్ గా మారి విశాల్ ముగ్గురు హీరోయిన్స్ తో...
పందెంకోడి చిత్రంతో తెలుగువారికి దగ్గరైన విశాల్ త్వరలో ప్లేబోయ్ అవతారమెత్తి ముగ్గురు హీరోయిన్స్ తో ఆడుకోనున్నాడు. 'కిలాడి' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటివారంలో విడుదల చేయటానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత విక్రమ్ కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ...' విశాల్ ఇంతవరకూ పోషించని ప్లేబోయ్ పాత్రను ఈ చిత్రంలో పోషించాడు. తను ఏ విషయంలోనైనా ఓ నిర్ణయం తీసుకునే ముందు మూడు రకాలుగా ఆలోచించడం ఈ హీరోకి అలవాటు. అలాగే తన జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిల్ని అనుకుంటాడు. ఇంతకీ విశాల్ ఆడుకోబోయే ముద్దుగు ముద్దుగుమ్మలూ...తనుశ్రీదత్తా, నీతూచంద్ర, సారాజైన్. ఈ ముగ్గురిలో ఎవరిని ఈ కిలాడి సొంతం చేసుకుంటాడన్న అంశాన్ని ఆసక్తికరమైన కథనంతో చిత్రీకరించాం. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, లవ్ అంశాలతో సాగే ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో వీటిని చిత్రీకరించాం. అన్ని తరగతుల వారిని అలరించే చిత్రమవుతుంది' అన్నారు. జి.కె. ఫిలిం కార్పొరేషన్ పతాకంపై విక్రమ్కృష్ణ నిర్మించిన ఈ 'కిలాడి' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 15కల్లా తొలి కాపీ వస్తుందని అన్నారు.