Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రూ 30 వేలు పోగుట్టుకున్నా, అభిమన్యుడు చిత్రంలో.. హీరోయిన్తో ఎఫైర్ గురించి క్లారిటీ, పవన్ గురించి!
Recommended Video
చాలా కాలం తరువాత అభిమన్యుడు చిత్రంతో మంచి విజయం అందుకున్న విశాల్ జోష్ మీద ఉన్నాడు. సైబర్ వేదికగా జరుగుతున్న అక్రమాలని అభిమన్యుడు చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ కావడంతో ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయంగా నిలిచింది. విశాల్, సమంత ఈ చిత్రంలో జంటగా నటించారు. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. అర్జున్ పాత్ర ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో విశాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
చాలా విషయాలు తెలుసుకున్నా
అభిమన్యుడు చిత్ర కథ వింటున్న సమయంలో చాలా విషయాలు తెలుసుకున్నానని విశాల్ విశాల్ తెలిపాడు. ఆర్మీ వాళ్లకు సరిగా రేషన్ ఉండదు, రైతులకు లోన్స్ ఇవ్వరనే విషయం అందరికి తెలుసు. ఆధార్ నంబర్ వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి వంటి విషయాలు తెలుసుకున్నానని విశాల్ తెలిపాడు.
అభిమన్యుడు చిత్రంలో
అభిమన్యుడు చిత్రం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కానీ జరుగుతున్న లోపాలని మాత్రం ఎత్తి చూపామని విశాల్ తెలిపాడు. ఆధార్ కార్డు విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందో మోడీ గారికే తెలుసు అని అన్నారు.
30 వేలు పోయాయి
తాను ఓ సారి బ్యాంకులో 30 వేలు పోగొట్టుకున్నానని విశాల్ తెలిపాడు. బ్యాంకు వారిని అడిగితే మీరే ఆన్ లైన్ లో వాడుకున్నారని సమాధానం ఇచ్చారని విశాల్ తెలిపాడు.
రైతులకు సాయం
రెండు తెలుగు రాష్ట్రలో అభిమన్యుడు చిత్రం మంచి లాభాలతో రన్ అవుతోందని విశాల్ తెలిపాడు. ఆ లాభం నుంచి కొంత రైతులకు సాయం చేయబోతున్నట్లు విశాల్ ప్రకటించాడు.
వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారో
రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం అని విశాల్ తెలిపాడు. తాను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. రజని, కమల్ హాసన్ ఏం చేస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నా. వారి మేనిఫెస్టో నచ్చితే వారివెంట నడిచే అవకాశం ఉందని విశాల్ తెలిపాడు.
పవన్ కళ్యాణ్ గురించి
పవన్ కళ్యాణ్ మంచి చేయాలని ప్రజల్లోకి వచ్చారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు విశాల్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు సంపాదించాలని రాజకీయాల్లోకి రాలేదని అన్నాడు.
హీరోయిన్తో ఎఫైర్ గురించి
చాలా
రోజులుగా
సీనియర్
నటుడు
శరత్
కుమార్
కుమార్తె
వరలక్ష్మి,
విశాల్
మధ్య
ఎఫైర్
నడుస్తోందంటూ
వార్తలు
వస్తున్న
సంగతి
తెలిసిందే.
దీనిపై
విశాల్
స్పందించాడు.
తనకు
వరలక్ష్మి
మంచి
స్నేహితురాలని
విశాల్
తెలిపాడు.
తన
కష్టాలు
సంతోషాలు
వరలక్ష్మితో
పంచుకుంటానని,
మా
మధ్య
ఎదో
జరుగుతోంది
అనే
వార్తల్లో
వాస్తవం
లేదని
విశాల్
తెలిపాడు.