Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విశాల్ తొలి తెలుగు సినిమా ఖరారు
జికె ఫిల్మ్ కార్పొరేషన్ అధినేత విక్రమ్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ....'చాలా కాలంగా విశాల్ తెలుగులో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మంచి కథ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. దర్శకుడు శశికాంత్ విశాల్కి పర్ఫెక్ట్గా సూటయ్యే కథ చెప్పారు.
ఫస్ట్ సిట్టింగ్లోనే కథను విన్న విశాల్ తెలుగు ప్రాజెక్ట్ చేసేందుకు అంగీకరించడం జరిగింది. భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈచిత్రాన్ని నిర్మించబోతేన్నారు. నవంబర్లో సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తాం' అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: వడ్డి రామానుజం, నిర్మాత: విక్రమ్ కృష్ణ, కథ, దర్శకత్వం: శశికాంత్.
విశాల్ నటించిన పందెం కోడి చిత్రంతో పాటు, వాడు-వీడు చిత్రాలు తెలుగులో మంచి మార్కెట్ చేసాయి. కిలాడీ చిత్రం మాత్రం తెలుగులో పెద్ద ప్లాప్గా మిగిలింది. ఈ నేపథ్యంలో విశాల్ తెలుగు ఎంట్రీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.