Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'దూసుకెళ్తా' లో పాత్ర గురించి లావణ్య త్రిపాఠి
హైదరాబాద్ : మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దూసుకెళ్తా'. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది. వీరూ పోట్ల డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో మంచు విష్ణు పాత్రకేయుడుగా కనిపిస్తారు. అలాగే డాక్టర్ అలేఖ్యగా లావణ్య కనిపిస్తుంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.... ''తొలి సినిమా 'అందాల రాక్షసి'తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండో సినిమా అనేసరికి ఎలాంటి కథని ఎంచుకోవాలని ఆలోచనలో పడ్డాను. అయితే తొలిసినిమాకి భిన్నంగా ఉండాలి అని మాత్రం అనిపించింది. అలా నేను ఎంచుకున్న సినిమానే ఈ 'దూసుకెళ్తా'. డాక్టర్ అలేఖ్యగా మీ ముందుకుకొస్తున్నాను'' అన్నారు .
అలాగే ...''నేను చేసే ప్రతి పాత్ర అందరికి నచ్చాలనుకునే తత్త్వం నాది. అలేఖ్య పాత్ర ద్వారా అన్నిరకాల భావాలు పలికించే అవకాశం లభించింది. బ్రహ్మానందంలాంటి వ్యక్తితో వినోద సన్నివేశాల్లో పాలుపంచుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. దీంతోపాటు నా డ్యాన్స్ ప్రతిభని చూపించే అవకాశం కూడా దక్కింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ల నటన అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా వారిలా వైవిధ్యమైన పాత్రలు పోషించాలన్నదే నా కోరిక '' అన్నారు లావణ్య త్రిపాఠి.
ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో కథానాయకుడి పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయట. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు. విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. వీరు పోట్ల దర్శకుడు. మోహన్బాబు నిర్మాత.
వీరు పోట్ల మీడియాతో మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు.