Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘దేనికైనా రెడీ’ నిలిపివేత... కోర్టులో తేల్చుకుంటామన్న విష్ణు
హైదరాబాద్: మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంపై వివాదం మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో మరింత ముదురుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు 'దేనికైనా రెడీ' చిత్రంపై కదం తొక్కుతున్నారు. నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మయూరి థియేటర్లో సినిమాను అడ్డుకోవడానికి బ్రాహ్మణులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తాజాగా బుధవారం 'దేనికైనా రెడీ' చిత్రంపై వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ వద్ద బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ ప్రదర్శన నిలిపి వేసారు. బ్రాహ్మణులు సహనంతో చేసిన ఆందోళన, వినతులపై... మోహన్ బాబు వ్యంగంగా స్పందించిన విషయం తెలిసిందే. వాళ్లు బ్రాహ్మణులు కారు, వేదం చదివే వారు ఇలాంటి పనులు చేయరు, వాళ్లు చందాలు అడుక్కోవడానికి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో బ్రాహ్మణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
మరో వైపు బ్రాహ్మణుల ఆందోళన కార్యక్రమాలపై హీరో మంచు విష్ణు స్పందించారు. తాము ఏ కులం వారిని కించపరిచేలా సినిమాలో చూపించలేదన్నారు. బ్రాహ్మణులను ఎంతో గౌరవించే కుటుంబం మాది. సినిమా వివాదం కోర్టుకు వరకు వెళ్లినందుకు తాము కూడా ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సినిమా వివరాల్లోకి వెళితే.... అక్టోబర్ 24న విడుదలైన ఈచిత్రం మంచి కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్తేజ, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్ బాబు.