Don't Miss!
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
విష్ణు పొలిటికల్ సెటైర్ వెబ్ సిరీస్ మొదలు.. హీరో శ్రీకాంత్ను వాడుకుని.. వాళ్లే టార్గెట్
చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు మంచు విష్ణు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'ఢీ' అనే సినిమా మినహా ఆయనకు అంత పెద్దగా పేరు తెచ్చినవి తక్కువే. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం అన్వేషిస్తున్న ఈ మంచు వారి అబ్బాయి.. ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఇటీవల 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ హీరో పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వ్యవహరించాడు విష్ణు. ఇకపై సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయాడు.
ఇందులో భాగంగానే అతడు ఇటీవల ఒకేరోజు నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించాడు. ఈ మేరకు ట్విట్టర్లో ''ఈరోజు నాలుగు ప్రాజెక్టులను మొదలుపెట్టాను. అందులో రెండు నేను నటించేవి కాగా, మరొకటి వెబ్ సిరీస్, అలాగే ఇంకొకటి ఫీచర్ ఫిల్మ్. నాకు లక్ కలిసి రావాలని కోరుకుంటున్నాను. రెండు సంవత్సరాలు చేతి నిండా పనే'' అంటూ రాసుకొచ్చాడు. ఇప్పటికే తాను నటిస్తున్న రెండు సినిమాలనూ అధికారికంగా ప్రారంభించాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ను స్టార్ట్ చేశాడు.
ప్రముఖ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో 'చదరంగం' అనే వెబ్ సిరీస్ను బుధవారం ప్రారంభించాడు విష్ణు. ఈ కార్యక్రమానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాన పాత్రధారి శ్రీకాంత్పై ఆయన క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఈ వెబ్ సిరీస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను చూపించబోతున్నారని తెలుస్తోంది. అది కూడా సెటైరికల్గా ఉంటుందని అనుకుంటున్నారు.
నిర్మాత విష్ణు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక హింట్ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ కొంత మందికి వ్యతిరేకంగా ఉండబోతుందట. దీంతో ఈ వెబ్ సిరీస్పై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఇది తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఈ వెబ్ సిరీస్ ఎవరికి వ్యతిరేకంగా ఉండబోతుంది..? ఎవరిని ఇందులో టార్గెట్ చేశారు..? అనేవి తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.