Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఓ వైపు సీనియర్లు.. మరోవైపు సిక్స్ప్యాక్ హీరోలు.. విశ్వక్ సేన్ పంచ్
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదల కానుంది. బుధవారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. యువ హీరోలు నిఖిల్, సుధీర్ బాబు ముఖ్య అతిథులుగా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ, 'ఫలక్నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ " ఒక వైపు సీనియర్లు.. మరోవైపు సిక్స్ప్యాక్ హీరోలు ఉన్నారు. ఇక మాట్లాడుతాం అని పంచ్ వేశారు. అనంతరం ప్రసంగిస్తూ... సినిమా ప్రొడ్యూస్ చేయడం పుణ్యం. సెట్ మీద రోజుకు మూడుసార్లు అన్నదానం జరుగుతుంది. నేను సినిమా చేసినన్ని రోజులూ ప్యాకప్ చెప్పిన తరవాత అలసట కంటే ఇంతమందికి మనం భోజనం పెడుతున్నామనే సంతృప్తి ఉండేది. అదీ మంచి మనసుతో, సినిమాపై పిచ్చితో చేస్తే.. ఆ సినిమాకు ఎప్పుడూ హాని జరగదు. తప్పు జరగదు అని అన్నారు.
సందీప్ కిషన్లో అదే ప్యాషన్ చూశాను. తనను ఎవరో నిర్మాత ఏదో అన్నారట. ఆయన సందీప్ కిషన్ చేసిన పాతిక సినిమాలు మర్చిపోయినట్టున్నారు. ఆ సినిమాలు ఇండస్ట్రీలో ఎంతోమందికి భోజనం పెట్టాయి. నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్కి వెళ్లినప్పుడు 'షోర్ ఇన్ ది సిటీ' వచ్చింది., అప్పుడు 'ఇండస్ట్రీలో ఉండిపోవడానికి ఈ సందీప్ వచ్చాడు' అనుకున్నా. నా గెస్ ఎప్పుడూ రాంగ్ కాలేదు. నన్ను ఇన్స్ఫైర్ చేసిన ఫస్ట్ పర్సన్ సందీప్ కిషన్. తనకు ఆల్ ది బెస్ట్. కొత్త రకం సినిమాతో వచ్చాడు. తప్పకుండా హిట్ అవుతుంది" అని విశ్వక్ సేన్ జోస్యం చెప్పారు.
కాగా, గెస్టులుగా హాజరైన హీరోలకు సినిమా సెకండ్ టికెట్ను సందీప్ కిషన్ అందజేశారు. సెంటిమెంట్గా ఫస్ట్ టికెట్ ఎవరికి ఇస్తామనేది గురువారం చెబుతామని సందీప్ తెలిపారు. ఈ ఫంక్షన్ను 'జె మీడియా ఫ్యాక్టరీ' నరేంద్ర ఆర్గనైజ్ చేశారు. మంజుష, భార్గవ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు, APR ప్రాజెక్ట్స్ అధినేత సంజీవ్ రెడ్డిగారు, టైల్స్ మార్ట్ అధినేత జగ్గారావుగారు, సుప్రియగారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.