Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కమల్ ’విశ్వరూపం 2’ట్రైలర్ రిలీజ్ డేట్
హైదరాబాద్ : విశ్వనటుడు కమల్ హసన్ నటిస్తూ, రూపొందిస్తున్న 'విశ్వరూపం 2' చిత్ర ట్రైలర్ ను ఆయన జన్మదినం నవంబర 7 తేదిన విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఆయన జన్మదినం రోజునే విశ్వరూపం ట్రైలర్ను ఆరో 3డిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ముందే విడుదల చేయాలనుకున్నాం. కొంత ఎడిటింగ్ పూర్తికావడంలో ఆలస్యమైంది.అందుచేత కమల్ జన్మదినం రోజున ట్రైలర్ను విడుదల చేయాలని అనుకుంటున్నాం అని చిత్ర యూనిట్కు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి.
విశ్వరూపం-2 చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్ హాసన్.....ఎవరితో పోటీ పడకుండా సింగిల్గా వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన 'ఆరంభం' చిత్రం కూడా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు ముందు గానీ, తర్వాతగానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే నవంబర్లో కానీ, డిసెంబర్లో కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నమాట. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.
ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
కమల్ చెన్నైలో ఇటీవల మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.
విశ్వరూపం చిత్రానికి సీక్వెల్గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.